Mudragada Padmanabham Last Rites With State Honours: కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నేత ముద్రడగ పధ్మనాభం అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముద్రగడ పద్మనాభంకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు అవరసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సాయిప్రసాద్ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.