ఏపీలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం వరకూ ఎండ తీవ్రత ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తాంధ్ర జిల్లాలలో మే 24వ తేదీ వరకూ ఎండలు దంచికొడతాయని వెల్లడించింది. మంగళవారం రోజున పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.