Andhra Pradesh Government Launches Mee Marts: ఏపీ ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను చౌక ధరల్లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మీ మార్టులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కంటే తక్కువ ధరలకు నాణ్యమైన సరకులు అందిస్తారు. రేషన్ డీలర్లకు అదనపు ఆదాయం, ఆర్థిక భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 1000 మీ మార్టులు ప్రారంభిస్తారు. త్వరలోనేడిజిటల్ రూపీతో అనుసంధానం చేస్తారు.