ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ 30 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక..

1 year ago 29
ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత పెరుగుతోంది. పలుచోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. బయటకు వెళ్లే సమయంలో వెంట ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు , దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Entire Article