సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో అజెండాలోని 30 అంశాలపై మంత్రులు చర్చించారు. పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అయితే వివిధ కారణాలతో పలువురు మంత్రులు కేబినెట్ భేటీకి దూరమయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్ కూడా మంత్రిమండలి భేటీకి దూరంగా ఉన్నట్లు తెలిసింది.