‘ఏక్ పేడ్ మా కే నామ్’ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట మొక్క నాటాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని ఆకాంక్షించారు. ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలవాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్కులో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. తన తల్లి అంజనా దేవి గారి పేరిట తెల్లపొణికి మొక్క నాటారు.