పల్నాడు జిల్లాలోని ఎస్టీ విద్యార్థులకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శుభవార్త వినిపించారు. ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఎస్టీ విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఇటీవల వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో పల్నాడు జిల్లాలో 600లకు పైగా మార్కులు సాధించిన 287 మంది ఎస్టీ విద్యార్థులకు విజ్ఞాన్ వర్సిటీలో ఉచితంగా సీట్లు ఇవ్వనున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఎస్టీ విద్యార్థుల అభినందన సభలో ఎంపీ ఈ ప్రకటన చేశారు.