కడప జిల్లా వాసుల నిరీక్షణ ఫలించనుంది. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. జూలై మూడో తేదీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించిన తర్వాతే పనులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన స్టీల్ ప్లాంట్ ద్వారా.. యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు బైరెడ్డి శబరి.