ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ.. ముగ్గురు మృతి..

10 months ago 19
మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలంలో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వనపర్తి జిల్లాకు చెందిన ముగ్గురు ప్రయాణికులు భూత్పూరు వైపు వెళ్తుండగా.. కొత్తమొల్గర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఎదురుగా వస్తున్న మరొక ఆటోను ఢీకొన్నాడు. ఈ ఘటనలో వంశీ, నర్సింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడే తీవ్రగాయాలు పాలైన సక్రిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article