ఎట్టకేలకు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఏప్రిల్ నుంచే అమలు..

6 months ago 22
తెలంగాణలోని 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏప్రిల్ నుంచి వీరి జీతాలను మధ్యవర్తులు, ఏజెన్సీల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు వాడుతున్న ఐఎఫ్ఎంఎస్ (IFMS) విధానం లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారా ఈ చెల్లింపులు జరగనున్నాయి. దీనివల్ల ఏజెన్సీలు చేసే జీతాల కోతలకు, పీఎఫ్ మరియు ఈఎస్ఐ నిధుల మళ్లింపునకు అడ్డుకట్ట పడనుంది. ఆధార్ అనుసంధానం ద్వారా బినామీలను ఏరివేసి, పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటు సామాజిక భద్రతపై భరోసా లభించనుంది.
Read Entire Article