ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికులకు ఉచిత ప్రయాణం కల్పించలేమంటూ రైల్వే బోర్డు తేల్చి చెప్పింది. ఇప్పటికే భారీ నష్టాలను చవిచూస్తున్నామని.. ఈ ఉచిత రైలు ప్రయాణాన్ని అమలు చేయలేమని వెల్లడించింది. ఆపరేషన్ నష్టాలు, అదనపు వ్యయాన్ని భరిస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైల్వే బోర్డు ఆరా తీసింది. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర సర్కార్ వాటా బకాయిలను కూడా చెల్లించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.