ఉప్పాడలో అల్లకలోలం.. వణికిస్తోన్న ఫెంగల్ తుఫాను

1 year ago 28
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుఫాను పుదుచ్చేరిలోని మహాబలిపురం- కరైకల్ మధ్య శనివారం రాత్రి తీరం దాటింది. ఈ తుఫాను క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు ఐఎండీ పేర్కొంది. తుఫాను ప్రభావంతో ఆదివారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఫెంగల్ తుఫానుతో శనివారం ఈదురు గాలులు వీచాయి. సముద్ర తీర ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ, కాట్రేనికోన, ఉప్పలగుప్తం తదితర ప్రాంతాల్లో భారీ అలలు దూసుకొవచ్చాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూడో తేదీ వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని సూచించారు.
Read Entire Article