తెలంగాణ దేవాదాయ శాఖలో గ్రేడ్-2 ఈవోలుగా పనిచేస్తున్న 26 మందికి గ్రేడ్-1 ఈవోలుగా పదోన్నతి లభించింది. హైదరాబాద్ సచివాలయంలో శుక్రవారం దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా అర్చక, ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు ద్వారా రిటైర్మెంట్ గ్రాట్యుటీ, ఉపనయనం గ్రాంట్, విద్యా నిధి తదితర పథకాల ప్రయోజనాలను పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ పెంచిన సంక్షేమ లబ్ధి 2026 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు.