ఉచితాలు ఎవడియ్యమన్నాడు.. సర్కార్‌కు బామ్మ ఇచ్చిపడేసిందిగా..!

1 year ago 18
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న జీతభత్యాల గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలపై రిటైర్డ్ మహిళా ఉద్యోగి మండిపడ్డారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఉద్యోగులు కట్టే టాక్సులతో ఉచితాలు ఎవడు ఇవ్వమన్నాడంటూ ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. ఉచిత పథకాలు ఇచ్చి తమ జీవితాలు ఎవరు నాశనం చేయమన్నారని ప్రశ్నించింది. ఉచితాలు పెట్టకుండా.. కంపెనీలు తెచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవన్నారు. అసలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాలు ఎందుకని.. 10 కార్లు ఎందుకని అడిగారు. సొంత పైసలు వాడుకోండని.. తమకు మాత్రమే కేటాయించిన బడ్జెట్‌ను జీతాల కోసమే వాడాలని.. మిగతా వాటికి వాడొద్దని వృద్ధురాలు హెచ్చరించారు.
Read Entire Article