ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. అవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని.. వాటిని నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తోందని.. ఇదే జరిగితే పథకాన్ని తీసేస్తారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యం కోసమే ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది.