ఇలా చేస్తే బావుంటుంది, కనీసం రూ.26వేలు.. సీఎం చంద్రబాబుకు షర్మిల సలహాలు

1 year ago 18
Ys Sharmila On Mirchi Framers: రాష్ట్రంలో రైతుల్ని ఎర్రబంగారం ఏడిపిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడికి పెట్టిన పైసలు రాక అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటూ రైతు కన్నీళ్లు పెడుతున్నారని చెప్పారు. క్వింటాకు రూ. 15 వేల నష్టంతో అమ్ముకుంటుంటే.. అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం .. మిర్చి రైతుల కళ్లలో కారం కొడుతుందని ఆరోపించారు. మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఉద్దరించినట్లు గొప్పలు చెబుతున్నారన్నారు.
Read Entire Article