Kakinada Ummetha Leaves Curry Insta Video: కాకినాడ జిల్లాకు చెందిన కుటుంబం హైదరాబాద్లో నివాసం ఉంటోంది. వీరు సొంతూరులో ముత్యాలమ్మ తీర్థం ఉండటంతో హైదరాబాద్ నుంచి వెళ్లారు. మొబైల్లో ఇన్స్టాగ్రామ్ వీడియో చూసి ఉమ్మెత్త ఆకులు, పప్పు కూర వండుకుని తినడంతో నలుగురు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. పాపం తీర్థం చూసేందుకు వెళ్లి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారు. ఉమ్మెత్త మొక్క చాలా డేంజర్ అని డాక్టర్లు చెబుతున్నారు.