ఇద్దరు పిల్లలకు ఒకే ఆధార్ నంబర్.. ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు

11 months ago 21
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్‌లో ఇద్దరు పిల్లలకు ఒకే ఆధార్ నంబర్ కేటాయించడం గందరగోళానికి దారి తీసింది. జిల్లాలోని మనుబోతుల సుమన్ కుమారుడు ధనుష్, కత్తెరపెల్లి బాబు కొడుకు శివ ఇద్దరికీ ఒకే ఆధార్ నంబర్ కేటాయించారు అధికారులు. వీరిని పాఠశాలలో చేర్పించే సమయంలో ఈ విషయం తెలిసింది. దీనిపై ఆధార్ కేంద్రాలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి ఇద్దరికి వేర్వేరు ఆధార్ నంబర్లు జారీ చేయాలని కోరుతున్నారు.
Read Entire Article