Chittoor Women Get Pension 4 Years After Death: చిత్తూరు జిల్లాపెనుమూరు మండలం బట్టువారిపల్లెలో ఓ మహిళ చనిపోయిన నాలుగేళ్లకు పింఛను మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. స్థానికురాలైన సావిత్రమ్మ డ్వాక్రా సంఘంలో సభ్యురాలు కాగా.. డ్వాక్రా సభ్యురాలికి 60 ఏళ్లు దాటితే డ్వాక్రా పథకం కింద నెలకు రూ.500 పింఛను ఇస్తారు. కానీ సావిత్రమ్మ చనిపోయిన దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆమెకు పింఛను మంజూరైనట్లు రికార్డుల్లో చూపించింది. ఆమె ఇంటికి వచ్చిన అధికారులకు ఊహించని పరిస్థితి ఎదురైంది.