Tirumala 116 Year Old Woman TTD VIP Break Darshan: తిరుమల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు 116 ఏళ్ల బామ్మ కాలినడకన తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ స్పందించారు. బీఆర్ నాయుడు ఆమెతో పాటుగా ఆమె కుటంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఆమె వివరాలు తెలుసుకుని ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు.