ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. పాలక మండలి ఏర్పాటు అనంతరం మొదటి విడతలో 43 ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేయాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్, అధికారుల కోసం వీటిని వినియోగించనున్నారు. మరోవైపు పలు కీలక ప్రతిపాదనలకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది.