ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం.. మేయర్ ఎమోషనల్..

1 year ago 40
బెజవాడ ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. విజయవాడ మేయర్ అయిన తనను సిబ్బంది అడ్డుకుంటున్నారని మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆరోపించారు. ప్రోటోకాల్ ఉన్నప్పటికీ పదే పదే అడ్డు తగులుతున్నారని.. ఎమోషనల్ అయ్యారు. మేయర్ అంటే నగరానికి ప్రథమ పౌరురాలు అని.. ప్రోటోకాల్ పాటించరా అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వం అంటూ ప్రోటోకాల్ పాటించకపోతే.. రాబోయే రోజుల్లో దీని ఫలితాన్ని అనుభవిస్తారంటూ రాయన భాగ్యలక్ష్మి భావోద్వేగం చెందారు.మరి దీనిపై దుర్గ గుడి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Read Entire Article