తల్లిదండ్రులు ఇంట్లో గొడవపడటం చూసి.. తాగొచ్చిన ఆ కొడుకు చికాకు వచ్చింది. వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొడుకు ఇంట్లో నుంచి కోపంగా బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటల అయినా బయటకు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవడంతో ఇంట్లో వాళ్లు ఫోన్ చేశారు. అరగంటలో వస్తానని చెప్పాడు.. కానీ ఉదయం లేచే సరికి హైవేపై శవంగా మారాడు. ఎవరో తలమీద కొట్టడంతోనే చనిపోయాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తిరుపతి రూరల్ పరిధి ఓటేరు నేషనల్ హైవేపై చోటుచేసుకుంది.