ఇంట్రెస్టింగ్ సీన్.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే!

1 year ago 31
Chandrababu Revanth Reddy Meet In Zurich: రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు దావోస్‌ చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో యూరప్‌ టీడీపీ ఫోరం సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌, అధికారులు ఉన్నారు. దావోస్‌ సదస్సుకు వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఇతరులు ఎయిర్‌పోర్టులో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు కాసేపు ముచ్చటించుకున్నారు. నేడు జ్యురిచ్‌లో పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు బృందం సమావేశం కానుంది.
Read Entire Article