ఇంట్లో వాళ్లంతా సొంతూరికి వెళ్లారు. అతనొక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. కొద్ది రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో అతను కూడా ఊరెళ్లాడని అందరూ అనుకున్నారు. కానీ తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లగా ఆ వ్యక్తి శవమై కనిపించాడు. దాంతో పోలీసులతో పాటు స్థానికులూ ఖంగుతిన్నారు. ఈ ఘటన తిరుపతిలోని తిరుచానూర్ చైతన్యపురంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.