తెలంగాణలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 984 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండా కేవలం రాతపరీక్ష, మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో అమల్లో ఉన్న ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేస్తూ సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో 550 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.