హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జూన్ 8న రాత్రి 9 గంటల నుంచి జూన్ 9 రాత్రి వరకు 176 ఏళ్ల నాటి సాంప్రదాయ బత్తిని చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఏర్పాట్లను సమీక్షించారు. భక్తుల కోసం మత్స్యశాఖ 1.4 లక్షల చేప పిల్లలను సిద్ధం చేయగా.. పోలీసులు, వైద్యశాఖ సీపీఆర్ బృందాలు, అంబులెన్సులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. మృగశిర కార్తె వేళలను బట్టి ఈసారి రాత్రి పూట పంపిణీ ప్రారంభం కానుంది.