ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పేద విద్యార్థులకు తీపి కబురు. కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యాసంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 80 సీట్లకు గానూ అర్హులైన 5వ తరగతి విద్యార్థులు ఈ నెల 31 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. సీటు సాధించిన వారికి 6 నుండి 12వ తరగతి వరకు ఉచిత సీబీఎస్ఈ విద్య, వసతి లభిస్తాయి. ఇందులో 75 శాతం సీట్లు గ్రామీణ విద్యార్థులకు, మూడో వంతు సీట్లు బాలికలకు రిజర్వు చేశారు. విద్యతో పాటు క్రీడలు, ఎన్సీసీ, ఐఐటీ కోచింగ్ ఇవ్వనున్నారు.