షాప్లో పనిచేసి ఇంటికి వచ్చిన భర్తకి ఆ భార్య మంచిగా ఆమ్లెట్ వేసి భోజనం పెట్టింది. అయితే, అదే సమయంలో పక్కనే తింటున్న భర్త తమ్ముడికి ఆమ్లెట్ ఎందుకు వేయలేదంటూ అత్త గొడవపడింది. ఈ క్రమంలో ప్లేట్ కూడా విసిరికొట్టింది. ఇంత జరుగుతున్నా భర్త ఏం మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ భార్య అందరూ పడుకున్న తర్వాత ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.