ఆదాయానికి మించి ఆస్తులు.. ACB అదుపులో కాళేశ్వరం మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు

10 months ago 21
నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) మురళీధర్ రావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌లలోని బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందిన మురళీధర్ రావు పదవీకాలాన్ని 13 ఏళ్లు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు కొనసాగిన ఆయనను మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత ప్రభుత్వం తొలగించింది.
Read Entire Article