ఆటోలపై బోల్తా పడిన ఇనుప స్తంభాల లారీ.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి

1 year ago 19
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మామూనురు ప్రధాన రహదారిపై ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. రహదారిపై లారీ పక్క నుంచి వెళ్తున్న రెండు ఆటోలు, కారుపై లారీ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిసింది.
Read Entire Article