ఆకివీడు రామాలయం శంకుస్థాపన సందర్భంగా ఉద్రిక్తత..

2 months ago 23
ఆకివీడులో రామాలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బీఎస్పీ కార్యకర్తలు ప్రయత్నించటంతో ఉద్రిక్తత తలెత్తింది. అయితే ముందే అప్రమత్తమైన పోలీసులు.. భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బీఎస్పీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు పటిష్ట బందోబస్తు మధ్య ఆదివారం ఉదయం ఆకివీడులో రామాలయం నిర్మాణానికి రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం పూర్తైంది.
Read Entire Article