Railway Recruitment Board In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్మెంట్) ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ బోర్డును అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెబుతోంది.. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్కు లేఖ రాశారు. ఆర్ఆర్బీ ఏర్పాటుతో ఏపీకి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రతిపాదనను పరిశీలించి ఆమోదించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.