BRS Working President KTR Praises AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటోందని.. నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తోందన్నారు. రైతుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోస్తోందని ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వాన్ని చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.