Andhra Pradesh Rains Today: ఏపీలో ఇవాళ విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాల్లో తీవ్ర ఎండ ప్రభావం ఉంటుందని.. మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంటున్నారు. అలాగే పలు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఎండలు, వర్షాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీ నేటి వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.