ఆ డబుల్ రోడ్డు నిర్మాణంపై అప్‌డేట్.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు జారీ..

5 months ago 15
రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజ్ నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పచ్చజెండా ఊపారు. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి మేరకు సుమారు రూ. 71 కోట్ల వ్యయంతో 21 కిలోమీటర్ల మేర ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. గుండ్లపల్లి, కొండాపూర్, ముద్దపల్లి సహా ఎనిమిది గ్రామాల మీదుగా వెళ్లే ఈ మార్గం ప్రజల రాకపోకలకు అత్యంత కీలకం. స్టేట్ హైవే-01తో అనుసంధానమై ఉన్న ఈ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అక్టోబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Read Entire Article