ఆ జిల్లాకు మంచి రోజులొచ్చాయ్.. కొత్త బస్ డిపోతో పాటు.. 20 ఎకరాల్లో కొత్త బస్టాండ్ కూడా..

6 months ago 14
ములుగు జిల్లాలోని మేడారం మహా జాతరకు వచ్చే ఏడాది కోటిన్నరకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ఆర్టీసీ అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనుంది. భక్తుల సౌకర్యార్థం వై జంక్షన్ వద్ద 20 ఎకరాలలో దాదాపు 3,600 బస్సులు నిలిపేందుకు వీలుగా తాత్కాలిక బస్టాండ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో పాటు.. జిల్లాలో రవాణా మెరుగు కోసం రూ. 5.91 కోట్లతో ఏటూరునాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణం, ములుగులో కొత్త బస్టాండ్ నిర్మాణాలు జరుగుతున్నాయి.
Read Entire Article