ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఒకటో తేదీనే అకౌంట్లోకి జీతం జమ..

1 year ago 36
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు ఇకపై ప్రతి నెల ఒకటో తేదీన నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు జమ కానున్నాయి. దీని కోసం గ్రీన్ ఛానల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గతంలో వేతనాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు, నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న పంచాయతీలకు ఈ నిర్ణయం ఊరటనిస్తుంది. మే నుండి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న 52 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో సహా మొత్తం 92,175 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
Read Entire Article