అలిపిరి నడక మార్గంలో చిరుత!.. భక్తులను గుంపులు గుంపులుగా పంపిన సిబ్బంది..

1 year ago 38
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకమార్గంలో ఆదివారం రాత్రి భక్తులకు చిరుత కనిపించింది. అలిపిరి మెట్ల మార్గంలోని 350వ మెట్టు సమీపంలో కొంతమంది భక్తులకు చిరుత కనిపించింది. దీంతో వారు కేకలు వేశారు. భయంతో పరుగులు తీశారు. వెంటనే ఈ విషయాన్ని టీటీడీ సిబ్బందికి చేరవేశారు. దీంతో టీటీడీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులను గుంపులు గుంపులుగా కొండపైకి పంపించారు. భక్తులతో పాటుగా సెక్యూరిటీ గార్డు. మెగా ఫోన్ పంపించి.. గోవింద నామాలు జపిస్తూ కొండపైకి పంపించారు.
Read Entire Article