అలా చేస్తే జైలు సిబ్బందికీ కఠిన శిక్షలు.. కొత్త చట్టం తీసుకురానున్న ఏపీ సర్కార్..

7 months ago 18
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి జైళ్ల చట్టాలను రద్దు చేసి.. వాటి స్థానంలో 'ది ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్, 2025' చట్టానికి రూపకల్పన చేసింది. ఈ కొత్త చట్టం ముసాయిదా బిల్లుకు.. డిసెంబర్ 11న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ కొత్త చట్టంలో.. ఖైదీలకు వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు.. జైళ్లలో సాంకేతికత వినియోగం, పారదర్శకతను పెంచేలా నిబంధనలు ఉన్నాయి. ఇక సెల్‌ఫోన్ వంటి నిషేధిత వస్తువుల వినియోగంలో ఖైదీలకు సహకరించిన సిబ్బందికి కఠిన శిక్షలు వేసేలా రూల్స్ ఉన్నాయి.
Read Entire Article