అలా అయితే పులివెందుల ఉపఎన్నిక..! రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు

1 year ago 31
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఎవరైనా లీవ్ అడగకుండా అసెంబ్లీకి 60 రోజులు రాకుంటే అనర్హత వేటు పడుతుందని అన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకవేళ 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉందంటూ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రతిపక్ష హోదాను స్పీకర్, సీఎం ఇచ్చేది కాదన్న రఘురామ.. ప్రజలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని అన్నారు.
Read Entire Article