శ్రీ సత్యసాయి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో మడకశిరలోని ఓ షాపు ముందు వృద్ధురాలు వింతపూజలు చేయటం స్థానికంగా కలకలం రేపింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో షాపు వద్దకు చేరుకున్న వృద్ధురాలు.. అరగంట పాటు కుంకుమ, పసుపుతో పూజలు చేశారు. ఉదయాన్నే షాపు వద్దకు చేరుకున్న యజమాని.. షాపు ముందర తతంగాన్ని గమనించి, సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.