అరుదైన ఘనత సాధించిన భద్రాద్రి దేవస్థానం.. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు

11 months ago 19
దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం అరుదైన ఘనత సాధించింది. ఆలయం ప్రతిష్టాత్మక ఐఎస్ఓ గుర్తింపు పొందింది. ఆహార భద్రత, ప్రసాదాల తయారీ, నిర్వహణ వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దేవస్థానం ఈవోకు మంగళవారం నాడు హైదరాబాద్‌లో ఐఎస్ఓ సర్టిఫికెట్లను అందజేశారు. ఇది భక్తులకు మరింత విశ్వాసాన్ని పెంచుతుందని అంటున్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article