'శ్రమ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.' ఈ మాటను నిజం చేశాడు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కుందం శివ అనే అనాథ విద్యార్థి. తల్లిదండ్రులను కోల్పోయి.. గుండెల్లో ఉన్న చెప్పుకోలేని బాధను తట్టుకుని జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరీలో 211వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 24వ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూటర్ సైన్స్లో సీటు దక్కించుకున్నాడు. పట్టుదలే ఉంటే పేదరికం, కష్టాలు చదువుకు అడ్డంకి కావని నిరూపించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.