ఏపీ రాజధాని అమరావతిలో మంత్రి పొంగూరు నారాయణ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ దిశగా ఇప్పటికే సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. దసరా రోజు మంచి ముహూర్తం కావటంతో ఆరోజున శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం. చంద్రబాబు నిర్మిస్తున్న ఇంటికి అత్యంత సమీపంలోనే 4500 చదరపు గజాల స్థలం మంత్రి నారాయణ కొనుగోలు చేసినట్లు సమాచారం. అక్కడే ఇంటి నిర్మాణానికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కసరత్తు జరుపుతున్నారు. అక్టోబర్ 2న శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.