సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర దేవి పేరుతో అమరావతిలో వంద ఎకరాలు భూమి కొనుగోలు చేశారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. ఎకరం రూ.20 లక్షలతో 100 ఎకరాలు కొనుగోలు చేసినట్లు పోస్టులు పెడుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల, పాములపాడు ప్రాంతాల్లో ఈ భూములు కొనుగోలు చేసినట్లు ఆర్ఓఆర్ 1బీలు పోస్ట్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై బాలకృష్ణ కుటుంబం స్పందించాల్సి ఉంది.