అమరావతి: హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం..

2 months ago 14
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా జీఏడీ, హెచ్ఓడీ టవర్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జీఏడీ టవర్ 47 అంతస్థులతో, మిగతా నాలుగు హెచ్ఓడీ టవర్లను 40 అంతస్తులతో నిర్మిస్తున్నారు. డయాగ్రిడ్ విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే టవర్ -1కు సంబంధించి మొదటి స్టీల్ డయాగ్రిడ్ అమర్చే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. మంత్రి నారాయణ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 2028 అక్టోబర్ నాటికల్లో టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Read Entire Article