అన్నా బస్సు ఆపు.. వాంతులొస్తున్నాయని చెప్పింది.. ఆపగానే, ఆ ఇంటర్ విద్యార్థిని ఎంత పని చేసిందీ!

9 months ago 15
తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన పూజిత అనే విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. మంగళవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కాలేజీ బస్సును ఆపాలని కోరిన పూజిత.. బస్సు ఆపగానే కాలువలోకి దూకేసింది. ఈ ఘటనతో బస్సులోని విద్యార్థులు, డ్రైవర్ షాక్ తిన్నారు. పూజిత కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే చదువులో మెరిట్ స్టూడెంట్ అయిన పూజిత ఇలా ఎందుకు చేసిందనేదీ ప్రశ్నార్థకంగా మారింది.
Read Entire Article