అన్నమయ్య జిల్లాలో మహాపచారం.. ఆంజనేయుడి గుడిని పునాదులతో సహా పెకిలించే ప్రయత్నం

1 year ago 39
తెలుగు రాష్ట్రాల్లో మరో ఆలయంపై దాడి జరిగింది. అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు సమీపంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంపై దుండగులు దాడి చేశారు. గడ్డపారలు, సమ్మెటలతో పునాదులతో సహా ఆలయాన్ని కూల్చివేసే ప్రయత్నం చేశారు. ఉదయమే అటుగా వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు ఆంజనేయస్వామి ఆలయంపై దాడి విషయంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కారకులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.
Read Entire Article