అన్నమయ్య జిల్లా: మదనపల్లె ఘటనపై చంద్రబాబు తీవ్ర విచారం .. బాలిక తల్లిదండ్రులకు ఫోన్

3 months ago 22
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబసభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించిన సీఎం.. దీని వెనుక ఉన్నవారిని ఎట్టిపరిస్థితులలోనూ వదిలిపెట్టేది లేదని అన్నారు. కఠిన శిక్ష పడేలా చూస్తామని బాలిక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. మరోవైపు మూడు రోజుల కిందట అదృశ్యమైన బాలిక.. ఎదురింట్లో శవమై కనిపించింది. ఎదురింట్లో ఉండే కులవర్ధన్ మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Read Entire Article